ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్తున్న సంగతి తెలిసిందే. ఆయన తాడేపల్లి నుంచి గన్నవరం వెళ్లి అక్కడి నుంచి ప్రత్యేక విమానం లో ఆయన ఢిల్లీ వెళ్తారు. ఢిల్లీ వెళ్ళిన వెంటనే ఆయన కేంద్ర మానవ వనరుల శాఖా మంత్రిని కలిసే అవకాశం ఉంది. అలాగే మధ్యాహ్నం మూడు గంటలకు కేంద్ర జలవనరుల శాఖా మంత్రిని కలవనున్నారు. 

 

ఆ తర్వాత కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ని కలిసే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత కేంద్ర బొగ్గు గనుల శాఖా మంత్రి ప్రహ్లాద్ జోషి, ఆ తర్వాత రాత్రికి హోం మంత్రి అమిత్ షా తో ఆయన భేటి అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి కొందరిని కూడా ఆయన కలుస్తారు అని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: