ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. కాసేపట్లో ఆయన ఢిల్లీ వెళ్ళాల్సి ఉండగా పర్యటన వాయిదా పడినట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. ఆయన రెండు గంటలకు ఢిల్లీ వెళ్ళాల్సి ఉంది. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో జగన్ ఢిల్లీ వెళ్తారు అని ముందు వార్తలు వచ్చాయి. 

 

కేంద్ర హోం శాఖా మంత్రిని జలవనరుల శాఖా మంత్రిని ఆయన కలుస్తారని అనుకున్నారు. అయితే అనూహ్యంగా అకేంద్ర హోం మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ దొరకలేదు అని అందుకే ఢిల్లీ పర్యటన వాయిదా పడింది అని సమాచారం. అయితే ఢిల్లీ పర్యటనకు ఎప్పుడు వెళ్తారు అనేది తెలియాల్సి ఉంది. దీనిపై త్వరలోనే ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: