తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా ఆవిర్భావ వేడుకలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. అయితే ఎలాంటి హడావుడి లేకుండా అన్ని జిల్లాల్లో కూడా ఆవిర్భావ వేడుకలను నిర్వహిస్తున్నారు. సిఎం కేసీఆర్ నుంచి గ్రామ సర్పంచ్ ల వరకు అందరూ కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఇక ఇదిలా ఉంటే సిద్ధిపేట జిల్లాలో విషాదం జరిగింది. 

 

దొమ్మాట లో జాతీయ జెండా ఎగురవేస్తూ ఉండగా... అంగన్వాడి టీచర్ భర్త ప్రాణాలు కోల్పోయారు. షాక్ కొట్టడం తో అక్కడిక్కడే ఆయన ప్రాణాలు కోల్పోయారు. పక్కనే ఉన్న ఇద్దరు టీచర్లకు కూడా గాయాలు అయ్యాయి. వెంటనే వారిని హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు అధికారులు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: