దేశ ఆర్ధిక వ్యవస్థను నిలబెట్టాలి అనే విశ్వాసం ఉంటే కచ్చితంగా నిలబెడతామని ప్రధాని నరేంద్ర మోడీ విశ్వాసం వ్యక్తం చేసారు. ఇప్పుడు దేశం ముందు అనేక సవాళ్లు ఉన్నాయని వాటిని కచ్చితంగా అధిగమిస్తామని ఆయన విశ్వాసం వ్యక్తం చేసారు. ఆత్మనిర్భర భారత్ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది అంటూ మోడీ వ్యాఖ్యలు చేసారు. 

 

కచ్చితంగా దేశాన్ని గాడిలో పెడతామని చెప్పిన ఆయన తమకు ఆ నమ్మకం ఉందని అన్నారు. దేశ ప్రజలకు ప్రధానిగా భరోసా ఇస్తున్నామని తనను అందరూ నమ్మాలని ఆయన కోరారు. రాబోయే రోజుల్లో మరింత సమర్ధవంతంగా పని చేస్తామని మన దేశంలో అన్ని వనరులు అవకాశాలు ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు. మా దృష్టి లో సంస్కరణలు అంటే సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడమే అని మోడీ వ్యాఖ్యలు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: