అడవి జంతువులకు సంబంధించి ఎప్పటికప్పుడు ఏదోక ఫోటో లేదా వీడియో పోస్ట్ చేస్తూ సందడి చేస్తూ ఉంటారు భారత అటవీ శాఖ అధికారి పర్వీన్ కష్వాన్. ట్విట్టర్ వేదికగా అయన చేసే ట్వీట్ లు ఎంతో ఆకట్టుకుంటూ ఉంటాయి. అడవి జంతువులకు సంబంధించిన అనేక విశేషాలను ఆయన పంచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు.
ఈ నేపధ్యంలోనే తాజాగా ఏనుగుల గుంపు కి సంబంధించిన ఒక ఫోటో ని ఆయన పోస్ట్ చేసారు ఏనుగులు అన్నీ ఒక చోట ఉండగా అవి అన్నీ ఎం మాట్లాడుకుంటున్నాయి అని ఆయన ప్రశ్నించారు. అసలు అవి మాట్లాడుకోవడానికి చర్చించుకోవడానికి సాధ్యం అయ్యే విషయం ఏంటీ అంటూ పర్వీన్ పోస్ట్ చేసారు. అయితే ఆహారం కోసం ఎక్కడికి వెళ్దామా అని మాట్లాడుకుంటున్నాయని కొందరు కామెంట్ చేస్తున్నారు.
I just wonder. What could be the possible topic for this group discussion. pic.twitter.com/5kMJQCVOSE
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) June 2, 2020