జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులకు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. రోజు రోజుకి ఉగ్రవాదులను భారత ఆర్మీ టార్గెట్ చేస్తూ కాల్పులు జరుపుతుంది. గత ఆరు నెలల్లో దాదాపు వంద మంది ఉగ్రవాదులను కాల్చి చంపారు. తాజాగా మరోసారి జమ్మూ కాశ్మీర్ లో భారీగా ఉగ్రవాదులను టార్గెట్ చేసాయి బలగాలు. 

 

అవంతిపోరాలోని ట్రాల్‌లోని సైమో ప్రాంతంలో ప్రారంభమైన ఎన్‌కౌంటర్‌లో ఒక ఉగ్రవాదిని ఉదయం కాల్చి చంపారు. పోలీసులు, భద్రతా దళాలు ఉగ్రవాదులు ఉన్నారు అనే సమాచారంతో ఆపరేషన్ ని కొనసాగి౦చాయి. ఉదయం ఒక ఉగ్రవాదిని కాల్చి చంపగా ఎన్‌కౌంటర్‌లో మరో ఉగ్రవాదిని కాల్చి చంపారు. ఆపరేషన్ ముగిసిందని... ఆయుధాలు, మందుగుండు సామగ్రితో సహా కొన్ని పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నామని కాశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: