తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతుండగా సిద్ధిపేట జిల్లాలో ఒక వ్యక్తి విద్యుత్ షాక్ కు గురై మృతి చెందాడు. దౌల్తాబాద్ మండలం దొమ్మట గ్రామానికి చెందిన అంగన్‌వాడీ టీచర్‌ భర్త అశోక్ ఏర్పాట్లు చేస్తున్న సమయంలో విద్యుత్ షాక్ కు గురి కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో అంగన్ వాడీ ఆయాకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. అంగన్‌వాడీ కేంద్రంలో ఆవిర్భావ వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 
 
మంత్రి హరీష్‌ రావు ఈ ఘటనపై వెంటనే స్పందించారు. ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రభుత్వ పరంగా మృతుడి కుటుంబానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. అశోక్ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పారు. తీవ్ర గాయాలపాలైన కలవ్వను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌ యశోద ఆస్పత్రికి తరలించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: