ఆంధ్రప్రదేశ్ మాజీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో సుప్రీం కోర్ట్ కి వెళ్ళిన ఏపీ సర్కార్... అక్కడ దాఖలు చేసిన అన్ని పిటీషన్లలో కూడా తప్పుల తడకలు ఉన్నాయి. తప్పులు సరి చేసి మళ్ళీ పిటీషన్ దాఖలు చేయనుంది ఏపీ సర్కార్. ఇప్పుడు స్పెషల్ లీవ్ పిటీషన్ ని ఏపీ సర్కార్ దాఖలు చేయనున్నట్టు సమాచారం. 

 

రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ కాలాన్ని కుదిస్తూ ఇచ్చిన పిటీషన్ పై మరో మూడు స్పెషల్ లీవ్ పిటీషన్ లను ఏపీ సర్కార్ దాఖలు చేయను౦దని వార్తలు వస్తున్నాయి. అయితే ఇది ఒక మీడియా ఛానల్ మాత్రమే రాస్తున్న కథనం కావడం తో ఎంత వరకు నిజం ఉంది అనేది స్పష్టత రావడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: