విజయవాడ గ్యాంగ్ వార్ లో ఇప్పుడు సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన తోట సందీప్ అనే వ్యక్తికి... హత్య చేసిన కేటిఎం పండు అనే వ్యక్తికి పాత గొడవలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. అందుకే ఈ గొడవలో పండు... సందీప్  ని హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. 

 

అతను ప్రస్తుతం పోలీసుల అదుపులోనే ఉన్నాడు. వాళ్ళ ఇద్దరికీ ఫేస్బుక్ లో సహా పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో గ్రూపులు కూడా ఉన్నాయని పోలీసులు గుర్తించారు. వీళ్ళను రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళను పోలీసులు విచారించే అవకాశం ఉంది. దీని వెనుక రాజకీయ కోణం ఏమైనా ఉందా అనే దాని మీద పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: