గత కొన్ని రోజులుగా కాశ్మీర్ లో ఉగ్రవాదులకు ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఒక పక్క కరోనా ఉన్నా సరే వాళ్ళు మాత్రం ఆగడం లేదు. ఇక భారత ఆర్మీ కూడా వారి విషయంలో చాలా వరకు సీరియస్ గానే ఉంది. వరుసగా వారిని లక్ష్యంగా చేసుకుని భారత ఆర్మీ దాడులు చేస్తుంది. దీని తో పెద్ద ఎత్తున ఉగ్రవాదులను ఏరి వేస్తుంది ఆర్మీ. 

 

ఇక ఇది పక్కన పెడితే... నేడు కూడా అక్కడ భారీ కాల్పులు జరిగాయి. దీనిపై జమ్మూ కాశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ మాట్లాడుతూ... ఈ రోజు ఉదయం ట్రాల్‌లో జరిగిన ఆపరేషన్‌లో ఇద్దరు జెఎం ఉగ్రవాదులు మరణించారని చెప్పారు. వారి నుండి రెండు ఎకె -47, రెండు పిస్టల్స్ & పెద్ద మొత్తంలో మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. మే 30 న కుల్గాంలో 2 జెఎమ్ ఉగ్రవాదులు హతమయ్యారన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: