క్రికెట్ లేకపోవడం తో ఇప్పుడు టీం ఇండియా ఆటగాళ్ళు సోషల్ మీడియాలో ఎక్కువగా సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పుడు ఏదోక వ్యాఖ్య చేస్తూ అభిమానులకు వినోదం పంచె కార్యక్రమాలను చేస్తున్నారు. ఇక తాజాగా రైనా, హర్భజన్ మధ్య జరిగిన సంభాషణ ఆశ్చర్యంగా మారింది. సచిన్ బ్యాటింగ్ చూసేందుకు తాను స్కూల్ బంక్ కొట్టేవాడినని ఇటీవల సురేష్ రైనా కామెంట్ చేసాడు. 

 

1998లో షార్జా వేదికగా జరిగిన మ్యాచ్‌లో సచిన్ 143 పరుగులు చేశారని... ఈ మ్యాచ్‌ని చూసేందుకు తాను, తన స్నేహితులు స్కూల్‌లో చివరి రెండు తరగతులు ఎగ్గొట్టి టీవీలకు అతుక్కుపోయేవాళ్లమని వివరించాడు. దీనిపై స్పందించిన బజ్జీ మ్యాచ్ ‌జరిగిందే సాయంత్రం నాలుగు గంటలకు అయితే.. స్కూల్ బంక్ కొట్టాల్సిన అవసరం ఏముంది అంటూ సమాధానం ఇచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: