తమిళనాడులో దారుణం జరిగింది. పుదుకోట్టై జిల్లాలో మంత్రగాడి మాటలు నమ్మిన ఒక తండ్రి తన కూతురుని దేవతకు బలి ఇచ్చాడు. అయితే ఇక్కడ ఒక ఆశ్చర్యకర సంఘటన జరిగింది. తన కూతురుని ఎవరో చంపేశారు అని, అత్యాచారం చేసి హత్య చేసారు అని పోలీసులకు తండ్రి ఫిర్యాదు చేసాడు.

 

అక్కడి స్థానికులు కూడా అనుమానాస్పదంగా అమ్మాయి చనిపోయి ఉండటం తో ముందు షాక్ అయ్యారు. ఆ తర్వాత అనుమానం వచ్చి తండ్రిని పన్నీర్ సెల్వం ని పోలీసులు విచారించారు. విచారణలో అసలు విషయం చెప్పాడు తండ్రి. తాను మంత్రగాడి మాటలు నమ్మి కూతురిని దేవతకు బలి ఇచ్చాను అని చెప్పాడు అతను. అతనితో పాటు మరొకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: