హైదరాబాద్ నగర శివారు లోని రాజేంద్రనగర్ లో చిరుత పులి మల్లి కనిపించింది. రాజేంద్రనగర్ లోని అగ్రికల్చరల్ యూనివర్సిటీ పరిసర ప్రాంతాలలో చిరుత పులి సంచరిస్తోంది. ఈ విషయాన్నీ రాజేంద్రనగర్లో అమర్చిన ట్రాప్ కెమెరాల ద్వారా తెలుసుకున్న అధికారులు హుటాహుటిన ఆ యూనివర్సిటీ పరిసర ప్రాంతాలలో గాలిస్తున్నారు.

 

అయితే దాదాపుగా మూడు వరాల నుండి ఆ చిరుత ఆ చుట్టుపక్కల తిరుగుతున్నట్లు అధికారులు తెలియజేసారు. అయితే సంబంధిత అధికారులు చిరుత ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఈ సారి ఎలాగైనా ఆ చిరుతను పట్టుకు తీరాల్సిందే అని అధికారులు భావిస్తున్నట్లు విశ్వసనీయమైన సమాచారం 

మరింత సమాచారం తెలుసుకోండి: