ఆప్ఘనిస్థాన్లోని కాబూల్ నగరంలోని మసీదు పేల్చివేత ఘటనలో ఇద్దరు మరణించగా, మరో 8మంది తీవ్రంగా గాయపడ్డారు. కాబూల్ నగరంలోని వజీర్ అక్బర్ ఖాన్ మసీదును కొందరు గుర్తుతెలియని దుండగులు పేల్చివేశారు. ఈ పేలుడులో మసీదులో ఉన్న ఇమాం ముహమ్మద్ అయాజ్ నియాజీతోపాటు మరొకరు అక్కడికక్కడే మరణించారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని దవాఖానకు తరలించారు.
మసీదు పేల్చివేత అత్యంత అమానుష, దారుణ ఘటన అని, ఈ ఘటనలో అమాయకులైన ఉలేమాలు మరణించారని ఆప్ఘనిస్థాన్ అధ్యక్ష అధికార ప్రతినిధి సిద్ధిఖీ తెలిపారు. ఈ అమానుష చర్యను ఆయన తీవ్రంగా ఖండించారు.