విజయవాడ గ్యాంగ్ వార్ ఏ స్థాయిలో సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిందే. ఆదివారం జరిగిన ఈ గ్యాంగ్ వార్ దెబ్బకు ఒక్కసారిగా విజయవాడ షేక్ అయింది. ఈ గ్యాంగ్ వార్ లో తోటా సందీప్ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే అతను తెలుగుదేశం పార్టీ కార్యకర్త. ఈ నేపధ్యంలో వైసీపీ కార్యకర్తలు కొందరు సోషల్ మీడియాలో ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. 

 

రంగనాయకమ్మగారిని పోలీసులు ప్రశ్నించినందుకు 66 ఏళ్ళ వృద్దురాలిని ప్రశ్నిసారా అని నానా హంగామా చేసిన తండ్రీకొడుకులు టీడీపీ కార్యకర్త తోటసందీప్ జనసేన వారి చేతిలో మరణిస్తే ఒక్క ట్వీట్  కూడా లేదని కామెంట్ చేస్తున్నారు. ప్రశ్నించడం కంటే మరణం చిన్న విషయమా వీరికి?? అని నిలదీస్తున్నారు. అదే వైసీపీ వారు చేసి ఉంటే వీరి హంగామా ఎలా ఉండేది అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: