టీం ఇండియా ఆటగాళ్ళు ఈ నెల మూడో వారం నుంచి ప్రాక్టీస్ చేసే అవకాశాలు కనపడుతున్నాయి. డిసెంబర్ లో ఆస్ట్రేలియా పర్యటనకు టీం ఇండియా వెళ్ళే అవకాశం ఉన్న సంగతి తెలిసిందే. అదే విధంగా జులై లో కూడా టీం ఇండియా పర్యటనకు వెళ్ళే సూచనలు ఉన్నాయి. దాదాపు రెండు నెలలుగా టీం ఇండియా ఆటగాళ్ళు ప్రాక్టీస్ కి దూరంగా ఉన్నారు.

 

అయితే ఐసోలేషన్ జాగ్రత్తలు తీసుకుని ప్రాక్టీస్ చేయించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది. అయితే కొన్ని కొన్ని వేదికల్లో మాత్రమే ప్రాక్టీస్ కి అనుమతులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అని క్రీడా ప్రముఖులు అంటున్నారు. ముంబై ని కొన్ని రోజులు పక్కన పెట్టే ఆలోచనలో ఉన్నారు అని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: