నిజామాబాద్ జిల్లాలో ఇప్పుడు కొరియర్ బాయ్స్ పేరుతో కొత్త రకం దోపిడి మొదలైనట్టు తెలుస్తుంది. కొరియర్ బాయ్ పేరు తో ఇంట్లోకి వచ్చి దోపిడి చేస్తున్నారు. మహిళల మెడలో గొలుసులు లాక్కుని వారిని కొట్టి పారిపోతున్నారు. శివారు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఇప్పుడు మహిళల మెడలో బంగారం చోరీ జరుగుతుంది. 

 

దీనితో ఎవరు అయినా తెలియని వారిని ఇంట్లోకి రానియ్యాలి అంటే చాలు అక్కడి స్థానికులు భయపడే పరిస్థితి వచ్చింది. చాలా వరకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక ఈ ఘటనల విషయంలో పోలీసులు కూడా అప్రమత్తంగా ఉంటున్నారు. ఎవరు వచ్చినా సరే తెలియని వారు అయితే తలుపులు తీయవద్దు అని చెప్తున్నారు. ఏదైనా అనుమానం వస్తే తమకు సమాచారం ఇవ్వాలి అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: