సీపీఐ సీనియర్ నేత తుళ్లూరి వెంకయ్య చౌదరి (80) నిన్న రాత్రి ఖమ్మంలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధ పడుతున్న టీవీ చౌదరి అనారోగ్యం వల్లే మృతి చెందినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. సీపీఐ జనరల్‌ సెక్రటరీ సురవరం సుధాకర్‌ రెడ్డి, పువ్వాడ నాగేశ్వరరావు, చాడ వెంకట్‌ రెడ్డితో పాటు పార్టీ శ్రేణులు ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటించారు. 
 
ఈరోజు ఉదయం 10 గంటలకు ఖమ్మంలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో టీవీ చౌదరి భౌతిక కాయాన్ని కార్యకర్తలు, నాయకుల సందర్శనార్థం ఉంచనున్నారు. అనంతరం అంత్యక్రియలను నిర్వహించనున్నారు. టీవీ చౌదరి ఖమ్మం జిల్లా సీపీఐ కార్యదర్శిగా, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా పలు పదవులు చేపట్టారు. సుదీర్ఘకాలం పాటు టీవీ చౌదరి సీపీఐ  జిల్లా కార్యదర్శిగా చౌదరి సేవలందించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: