సైక్లోన్ నిసర్గా దెబ్బకు పశ్చిమ తీరం వణికిపోతుంది. అక్కడ తుఫాన్ విరుచుకు పడుతుంది. దాదాపు పది నగరాలు దీని కారణంగా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. ఇక ముంబై లో జనాలు అయితే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతికే పరిస్థితి ఏర్పడింది. ఒక పక్క కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో ఈ పరిణామం మరింత ఆందోళనకరంగా ఉంటుంది.
దీనిపై ప్రముఖ హీరోయిన్ ప్రియాంకా చోప్రా ట్వీట్ చేసారు. నా తల్లి మరియు సోదరుడితో సహా 20 మిలియన్లకు పైగా జనాభా కలిగిన నా ప్రియమైన సొంత నగరమైన ముంబైకి ఆందోళనకరంగా ఉందని... 1891 నుండి ముంబై తీవ్రమైన తుఫాను సంక్షోభాన్ని ఎదుర్కోలేదు అని మరియు ప్రపంచం చాలా ఆందోళనలో ఉన్న సమయంలో ఇది మరింత వినాశనం సృష్టించే అవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు.
#CycloneNisarga is making its way to mumbai, my beloved home city of more than 20 million people, including my mom and brother. mumbai hasn't experienced a serious cyclone landfall since 1891, and at a time when the world is so desperate, this could be especially devastating. pic.twitter.com/zgne0vVpnR
— PRIYANKA (@priyankachopra) June 2, 2020