దేశ వ్యాప్తంగా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. మరోసారి 8 వేల కేసులు 24 గంటల్లో నమోదు అయ్యాయి. దీనితో కరోనా కేసుల సంఖ్య 2 లక్షలు దాటింది. గత 24 గంటల్లో 8,909 కొత్త కరోనా కేసులు దేశంలో నమోదు అయ్యాయి. 

 

ఇక మరణాల విషయానికి వస్తే  217 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు అని ప్రభుత్వం తెలిపింది. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం 101,497 క్రియాశీల కేసులు ఉన్నాయి. 100,303 మంది కోలుకున్నారు. దేశంలో ఇప్పటి వరకు కరోనాతో 5,815 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 207,615గా ఉందని ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: