నిసార్గా తుఫాన్ దెబ్బకు పశ్చిమ తీరం షేక్ అవుతుంది. గంట గంటకు తుఫాన్ దెబ్బకు ముంబై సహా దాని శివారు ప్రాంతాలు అన్ని కూడా భయం గుప్పిట్లో ఉన్నాయి. దీనితో ముంబై వాసులకు పలువురు కీలక సూచనలు చేస్తున్నారు. ఇప్పటికే ముంబై లోని కొన్ని ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే కార్యక్రమం చేస్తున్నారు.
ఈ నేపధ్యంలో ముంబై సహా మహారాష్ట్ర వాసులకు టాలీవుడ్ హీరో సాయి ధరం తేజ్ కీలక సూచనలు చేసాడు. తుఫాన్ చేత ప్రభావితమయ్యే లేదా ప్రభావితమయ్యే అన్ని ప్రాంతాలకు దయచేసి ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించండి మరియు సురక్షితంగా ఉండండని అతను ట్వీట్ చేసాడు. ఇక ముంబై లో భారీ వర్షాలు పడుతున్నాయి. తీరం దాటే సమయంలో గాలుల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
To all the areas which can be or will be impacted by #CycloneNisarga please follow the government guidelines and stay safe 🙏🏼 #CycloneNisarga pic.twitter.com/3GsNQzs13n
— Sai Dharam Tej (@IamSaiDharamTej) June 3, 2020