ఆంధ్రప్రదేశ్ లో అమరావతి ఉద్యమం గురించి మహేష్ బాబు మాట్లాడటం లేదని సొంత జిల్లా అయిన సరే కనీసం స్పందించడం లేదని చాలా మంది విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. మహేష్ బాబు అవసరానికి మాత్రమే ఆంధ్రప్రదేశ్ ని వాడుకుంటూ ఉంటాడు అని కొందరు ఆగ్రహంగా విమర్శలు కూడా చేసారు. తాజాగా అతనికి ఒక నెటిజన్ ఇదే విషయంలో క్లాస్ పీకాడు. 

 

అది ఏంటీ అంటే... అమెరికాలో జరుగుతున్న ఉద్యమంపై మహేష్ ఒక నల్ల ఫోటో పెట్టి పోస్ట్ చేసాడు. దీనిపై కిరణ్ అనే ఒక నెటిజన్... “పాపం ఈ స్టార్లు, సూపర్‌స్టార్ల పరిస్థితికి జాలేస్తుంది. అమరావతి రైతుల గురించి ఒక్క మాట మాట్లాడటానికి పాంట్లు తడుపుకుంటారు. అక్కడ ఎక్కడో అమెరికాలోనో, మరోచోటో జరిగే సంఘటనలకి మాత్రం కళ్ళు తుడుచుకుంటారని మండిపడ్డాడు .

మరింత సమాచారం తెలుసుకోండి: