నిన్న పెద్దపల్లి ఓపెన్ కాస్ట్‌1 ఫేజ్ 2 లో భారీ పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. ఈ పేలుడులో 5 మంది కాంట్రాక్ట్ కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపధ్యంలోనే గోదావరి ఖని సింగరేణి ఏరియా ఆస్పత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. బాధితుల బంధువులు అందరూ కూడా ఆస్పత్రికి వచ్చి 24 గంటలు గడుస్తున్నా సరే పోస్ట్ మార్టం నిర్వహించలేదు అని ఆగ్రహం వ్యక్తం చేసారు. 

 

మృతుల కుటుంబాలకు న్యాయం చెయ్యాలి అని కోరుతున్నారు. అలాగే మరణించిన వారి కుటుంబాలకు కోటి పరిహారం ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నారు. కార్మికుల బంధువులకు మద్దతుగా రెగ్యులర్ కార్మికులు కూడా విధులను బహిష్కరించి నిరసన తెలుపుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: