ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ కు సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ జెండా రంగులను నాలుగు వారాల్లో తొలగించాలని ఆదేశించింది. ఏపీ ప్రభుత్వం తొలుత చేసిన తప్పును సరిదిద్దుకోకుండా మరో రంగును యాడ్ చేసి తప్పు చేసిందని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. గతంలో ఏపీ ప్రభుత్వానికి రంగుల విషయంలో సుప్రీంలో షాక్ తగలగా తాజాగా మరోసారి సుప్రీం షాక్ ఇచ్చింది. 
 
రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం కొట్టివేసింది. నాలుగు వారాల్లో రంగులు తొలగించకపోతే కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకుంటామని పేర్కొంది. గతంలో రంగుల విషయంలో హైకోర్టులో వ్యతిరేకంగా తీర్పు రావడంతో జగన్ సర్కార్ సుప్రీంను ఆశ్రయించింది. తాజాగా జగన్ సర్కార్ కు సుప్రీంలో ఎదురుదెబ్బ తగలడం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: