తెలుగు రాష్ట్రాల్లో అడవి జంతువుల సందడి ఎక్కువైంది. పలు ప్రాంతాల్లో అడవి జంతువులు ఇప్పుడు స్వేచ్చగా తిరగడం ఆందోళన కలిగిస్తుంది. తెలంగాణాలో దాదాపు ఆరు చోట్ల పులుల హడావుడి మొదలయింది. ఇక హైదరాబాద్ లో కనపడిన పులి ఇప్పటి వరకు దొరకలేదు. ఇక ఇప్పుడు తిరుమలలో కూడా పులి కనపడింది. జూన్ 3న ఉదయం 3 గంటల సమయంలో తిరుమల వీధుల్లో సంచరిస్తూ కెమెరాకి చిక్కింది చిరుత.

 

కరోనా లాక్ డౌన్ తో జనసంచారం లేకపోవడంతో గత కొద్ది రోజులుగా తిరుమల వీధుల్లో విష సర్పాలు, అడవి మృగాలు విహారం చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై అధికారులు అప్రమత్తమయ్యారు. ఇక ఉద్యోగులు కూడా భయపడే పరిస్థితి ఏర్పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: