జమ్ము కశ్మీర్‌ పుల్వామా జిల్లా కంగన్ ప్రాంతంలో మరో ఎన్‌కౌంటర్ జరిగింది. ఈరోజు ఉదయం కంగన్ ప్రాంతంలో భద్రతా సిబ్బంది జరిపిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదులు ఉన్నారని సమాచారం అందడంతో భద్రతా సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. ఉగ్రవాదులు కాల్పులకు తెగబడటంతో జవాన్లు ధీటుగా స్పందించారు. పోలీసుల, ముష్కరుల ఎదురు కాల్పుల్లో ముగ్గురు ముష్కరులు ఘటనాస్థలంలోనే మృతి చెందారు. 
 
ముగ్గురు ఉగ్రవాదులు జైషే మహ్మద్ సంస్థకు చెందిన వారని తెలుస్తోంది. ముగ్గురు ఉగ్రవాదులలో ఒకరు ఐఈడీ నిపుణులు కూడా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. పోలీసులు ఆ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారేమోనని గాలిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: