దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ శరవేగంగా విజృంభిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ వాసులకు గజగజా వణికిస్తోన్న కరోనా తాజాగా పంజాగుట్టలోని నిమ్స్ ఆస్పత్రికి పాకింది. తాజాగా నిమ్స్ ఆస్పత్రిలో ఏడుగురు వైద్య సిబ్బందికి కరోనా నిర్ధారణ అయింది. కరోనా సోకిన వారిలో నలుగురు వైద్య సిబ్బంది, ముగ్గురు ల్యాబ్ సిబ్బంది ఉన్నట్టు తెలుస్తోంది. ఉన్నతాధికారులు ఏడు కరోనా కేసులపై అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. 
 
నిన్న ఉస్మానియా వైద్య కళాశాలలో 12 మంది కరోనా భారీన పడిన ఘటన మరవకముందే నిమ్స్ లో కరోనా కలకలం సృష్టిస్తోంది. వైద్య సిబ్బందికి కరోనా నిర్ధారణ కావడంతో మిగతా సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు హైదరాబాద్ నగరంలో ప్రతిరోజూ 100కు అటూఇటుగా కేసులు నమోదవుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: