తాను  జంతువుల హింస జరిగినప్పుడల్లా స్పందిస్తుంటే  తనపై ట్రోల్స్ వస్తున్నప్పటికీ ప్రతి సందర్భంలో సమానంగా తాను స్వరం వినిపిస్తాను  అంటూ చెప్పుకొచ్చింది రష్మి గౌతమ్. కొంతమంది ఆకతాయిలు పైనాపిల్ లో టపాకాయలు పెట్టి ఒక ఏనుగు  దగ్గరికి పడేయ్యగా ఏనుగు వాటిని నోట్లో పెట్టుకొని కొరకడంతో ఒక్కసారిగా ఆ టపాకాయలు పేలాయి... దీంతో  గర్భంతో ఉన్న ఏనుగు మరణించింది. 

 


 మామూలుగానే యాంకర్ రష్మి గౌతమ్ జంతువుల హింసను సహించదు అనే విషయం తెలిసిందే. ఇప్పటికే జంతువుల హింసకు సంబంధించి సోషల్ మీడియాలో పలు మార్లు కామెంట్ కామెంట్ చేసింది. తాజాగా మరోసారి రష్మి గౌతమ్ తనదైనశైలిలో కామెంట్ పెట్టింది. ఏ మతం కూడా జంతుబలి లేదా సమర్పణ కోరదు అంటూ చెప్పుకొచ్చింది రష్మి గౌతమ్. కేవలం ఇది వ్యక్తిగత ప్రయోజనాల కోసమే వ్యక్తులు చేసుకునేది తప్ప ఏ మతం ఇలా జంతు సంహారం గురించి చెప్పదు అంటూ తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: