విజయవాడలో సంచలనం సృష్టించిన గ్యాంగ్ వార్ పై ఇప్పుడు డీజీపీ గౌతం సవాంగ్ ఆగ్రహంగా ఉన్నారు. విజయవాడ పోలీస్ కమీషనర్ తో దీనికి సంబంధించిన అన్ని వివరాలను ఆయన తెప్పించుకున్నారు అని అదే విధంగా దాడికి పాల్పడిన వ్యక్తులకు సంబంధించిన పూర్తి నివేదిక ఆయన తెప్పించుకున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి ఒక కమిటి వేసి ఘటనలో ఉన్న వారి మీద కఠిన చర్యలను తీసుకునే విధంగా ఆయన అడుగులు వేస్తున్నట్టు సమాచారం. 

 

ఈ ఘటనలో పాల్గొన్న వారు ఎవరు అయినా సరే వదిలేది లేదని స్పష్టం చేస్తున్నారు. తాజాగా ఆయన దీనికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. సదరు వీడియో ని కూడా ఆయన చూసినట్టు తెలుస్తుంది. ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తామని ఆయన పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: