నెల్లూరు జిల్లా అధికారులపై ఎమ్మెల్యే ఆనం రామ నారాయణ రెడ్డి తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసారు. అధికారులు మరీ అధ్వాన్నంగా పని చేస్తున్నారని సిఎం వైఎస్ జగన్ ఇచ్చిన ఆదేశాలను కనీసం పట్టించుకోవడం లేదని ఇలాంటి అధికార యంత్రాంగాన్ని తాను అసలు చూడలేదని ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై తాను పై స్థాయిలో ఫిర్యాదు చేస్తా అంటూ ఆయన హెచ్చరించారు. 

 

అయితే ఎవరిని ఉద్దేశించి ఆయన అన్నారు అనేది మాత్రం స్పష్టత లేదు. గతంలో కూడా ఆయన ఇదే తరహాలో వ్యాఖ్యలు చేసారు. అప్పుడు పార్టీ నేతల మీద ఆయన వ్యాఖ్యలు చేయడం సంచలనం సృష్టించింది. అయితే ఇప్పుడు అధికారులు ఎం చేసారు అనేది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: