భారత్ చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం ఉన్న సంగతి తెలిసిందే. చైనా భారత్ ని రెచ్చగొట్టే విధంగా చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇక ఈ నేపధ్య౦లో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేసారు. చైనా జవాన్లు ఎవరూ భారత్‌లోకి ప్రవేశించలేదని దయచేసి భారత ప్రభుత్వం ధృవీకరించగలదా? అని ఆయన ప్రశ్నించారు. 

 

చైనా విషయంలో సరిహద్దుల్లో ఏం జరుగుతుందో కేంద్రం వెల్లడించాలని ఆయన డిమాండ్ చేసారు. గణనీయమైన సంఖ్యలో చైనా దళాలు తూర్పు లడఖ్‌లోకి ప్రవేశించాయని భారత రక్షణ శాఖా మంత్రి రాజనాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. దీన్ని ఎదుర్కోడానికి తాము అన్ని చర్యలూ తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ నేపధ్యంలోనే రాహుల్ ఈ వ్యాఖ్యలు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: