వేంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. 23 జిల్లాలకు మంత్రిగా చేసిన తనకు ఎమ్మెల్యే పదవి అలంకారం కాదని కీలక వ్యాఖ్యలు చేసారు. విద్య, వైద్యం, సంక్షేమ పథకాలపై అధికారులు నివేదికలు తయారుచేయలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. జలవనరుల శాఖలో అధికారులు నీళ్లు అమ్ముకుంటున్నారని ఆయన మండిపడ్డారు. ఎస్ఎస్ కెనాల్ను పరిశీలించాలని సీఎం జగన్ చెప్పినా అధికారులు వినడంలేదని ఆగ్రహం వ్యక్తం చేసారు.
40 ఏళ్ల రాజకీయ జీవితంలో ప్రస్తుతం జరుగుతున్న తీరు ఎప్పుడూ చూడలేదన్న ఆయన... 23 జిల్లాలకు మంత్రిగా చేసిన తనకు, ఎమ్మెల్యే పదవి అలంకారం కాదన్నారు ఆనం. ప్రజల కోసం ప్రభుత్వాన్ని, అధికారులను నిలదీయడానికి సిద్ధమని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేసారు.