ఆంధ్రప్రదేశ్ లో కరోనా తీవ్రత క్రమంగా పెరుగుతుంది. రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయి గాని తగ్గడం లేదు. నేడు దాదాపు 80 కేసులు రాష్ట్రంలో నమోదు అయ్యాయి. ఇక దీనికి తోడు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన  వారికి కూడా కరోనా సోకడం ఆందోళన కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు. ఇక ఇది పక్కన పెడితే తాజాగా ఆంధ్రప్రదేశ్ మంత్రి శంకర నారాయణ ఇంట్లో కరోనా కేసులు బయటపడ్డాయి. 

 

ఆయన ఇంట్లో 5 మంది కుటుంబ సభ్యులకు కరోనా సోకింది. తల్లి తమ్ముడు తో పాటుగా ఇతర కుటుంబ సభ్యులకు కూడా కరోనా సోకింది. దీనితో మంత్రి గారు హోం క్వారంటైన్ కి వెళ్ళారు. ఇక ఆయన వద్ద ఉన్న అధికారులకు కూడా కరోనా పరిక్షలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: