గ్రేట‌ర్ హైద‌రాబాద్ పై ఉన్న‌ట్టుండి క‌రోనా పంజా విసురుతోంది. క‌రోనా త‌గ్గుముఖం ప‌డుతుంద‌ని లాక్ డౌన్ ఎత్తివేస్తోన్న టైంలో గ్రేట‌ర్లో న‌మోదు అవుతోన్న కేసులు ఇప్పుడు తెలంగాణ‌లో తీవ్ర ఆందోళ‌న‌కు కార‌ణ‌మ‌వుతున్నాయి. తాజా అప్‌డేట్స్‌ను బ‌ట్టి చూస్తే గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో కేవ‌లం వారం రోజుల వ్య‌వ‌ధిలోనే 500కు పైగా కొత్త కేసులు న‌మోదు అయ్యాయి.

 

తెలంగాణ‌లో న‌మోదు అవుతోన్న కేసుల్లో ఎక్కువ భాగం ఇక్క‌డే న‌మోదు అవ‌డాన్ని బ‌ట్టి చూస్తే ఇక్క‌డ ఎంత ప్ర‌మాద‌క‌ర ప‌రిస్థితులు ఉన్నాయో తెలుస్తోంది.  ఇప్పటి వరకు గ్రేట‌ర్ హైద‌రాబాద్‌ పరిధి లో 1800 కేసులు నమోదు అయ్యాయి. గతవారం ఈ పరిధిలో 72 ఉన్న కంటైన్మెంట్స్ ఉంటే అవి ప్రస్తుతం 150కు చేరాయి. ఏదేమైనా ఈ కేసులు అదుపులోకి రాక‌పోతే ఇక్క‌డ పెద్ద ప్ర‌మాదం త‌ప్ప‌దు.

మరింత సమాచారం తెలుసుకోండి: