ఈ మద్య కొంత మంది మగాళ్లు కళ్లు ముసుకు పోయి కామంతో మృగాళ్లలా మారిపోతున్నారు.  చిన్న పిల్లలు.. వృద్దులు అని చూడకుండా ఆడవారు కనిపిస్తే చాలు చిత్త కార్తె కుక్కల్లా రెచ్చిపోతున్నారు.  దేశంలో కరోనా వైరస్ తో తల్లడిల్లిపోతుంటే మరోవైను కొంత మంది కామాంధులు ఆడవారిపై అఘాయిత్యాలకు పాల్పపడుతున్నారు. తాజాగా  నడిబజారులో కామంతో రెచ్చిపోయిన పోలీస్ ఆటోలో మహిళపై అత్యాచారానికి యత్నించాడు. మరో ఇద్దరితో కలసి ఆమెను గిల్లి, రక్కి రాక్షసంగా ప్రవర్తించాడు. ఆటోను ఊరంతా తిప్పుతూ బాధితురాలని వేధించాడు. ఒడిశా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌లో ఈ దారుణం జరిగింది.  శాంతిపల్లికి చెంది ఓ మహిళ తన భర్త వేధిస్తున్నాడని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వెళ్లింది.

 

అయితే అప్పటికే రాత్రి కావడంతో ఆటోలో వెళ్లి ఫిర్యాదు చేయాలని, తాను కూడా వస్తానని ఆమెను నమ్మించాడు. అప్పటికే పీకలదాకా తాగిన ఆ పోలీస్ ఆటోలో మరో ఇద్దరు కామాంధులు జత కావడంతో ఆమెపై అత్యాచారానికి యత్నించారు.  కానీ ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో ఆమెపై దాడికి యత్నించారు.. అప్పటికే ఆమె ఆటో నుంచి దూకింది.. అక్కడికి స్థానికులు చేరుకున్నారు. ఈ  విషయం తెలుసుకుని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు నిందితులతోపాటు డ్రైవర్ ను కూడా అరెస్ట్ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: