సిఎం జగన్ ఏడాది పాలన చూసిన తర్వాత... ఇక ప్రజలు చంద్రబాబు నాయుడు కి ఓటు వేసే అవకాశం లేదని వైసీపీ నేత ఎమ్మెల్యే అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. ఆయన చిరస్థాయిలో ప్రజల గుండెల్లో నిలిచిపోయారని అంబటి వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు గాని ఆయన కుమారుడు సిఎం అయ్యే అవకాశం లేదని చెప్పారు అంబటి. 

 

చంద్రబాబు ఉపన్యాసాలు ఇక మానుకోవాలని ఆయన సూచించారు. దేశ వ్యాప్తంగా సిఎం జగన్ మంచి ముఖ్యమంత్రిగా నాలుగో స్థానంలో నిలిచారు అని అంబటి అన్నారు. సిఎం జగన్ పాలన బాగుందని సి ఓటర్ సర్వే తేల్చింది అని అన్నారు అంబటి. కరోనా టెస్ట్ లలో దేశంలో ఏపీ అగ్ర స్థానంలో ఉందని కేంద్రం కూడా చెప్పిందని ఆయన పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: