తెలంగాణాలో కరోనా కేసులు ఏ మాత్రం కూడా తగ్గడం లేదు. కరోనా కట్టడికి ఎన్ని చర్యలు తీసుకున్నా సరే తెలంగాణాలో కేసులు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఇక హైదరాబాద్ లో కూడా భారీగా కేసులు నమోదు అవుతున్నాయి. 

 

నిన్న ఒక్క రోజే 108 మందికి హైదరాబాద్ లో కరోనా సోకింది. తెలంగాణలో బుధవారం కొత్తగా 129 కేసులు నమోదయ్యాయి, ఏడుగురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా మరణించిన వారి సంఖ్య 99 కు చేరుకుంది. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3,020 గా ఉంది. రాష్ట్రంలో 127 కేసుల్లో 108 హైదరాబాద్‌కు చెందినవి. రంగారెడ్డి జిల్లా, ఆసిఫాబాద్‌లో ఆరు కేసులు నమోదయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: