క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డికి కొన‌సాగుతున్న లాక్‌డౌన్ కార‌ణంగా విదేశాల్లో చిక్కుకున్న భార‌తీయుల‌ను స్వ‌దేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్ర‌భుత్వం వందేభార‌త్ మిష‌న్ చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. ఇందులో భాగంగా తెలుగురాష్ట్రాల‌కు కూడా విమానాలు వ‌స్తున్నాయి. జూన్‌ 11న సింగ‌పూర్ నుంచి హైద‌రాబాద్‌కు ప్ర‌త్యేక విమానం రానుంది. అలాగే.. జూన్ 18న విజ‌య‌వాడ‌కు కూడా సింగ‌పూర్ నుంచి ప్ర‌త్యేక విమానం రానుంది.

 

విదేశాల నుంచి వ‌స్తున్న వారిని అధికారులు క్వారంటైన్‌కు త‌ర‌లిస్తున్నారు. ఇందులో కూడా ప‌లువురు క‌రోనా వైర‌స్ బారిన ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో వైర‌స్ వ్యాప్తి నియంత్ర‌ణ‌కు అధికారులు క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: