కేరళలో గర్భం తో ఉన్న ఒక ఏనుగుని కొందరు మూర్ఖులు చంపడంపై ఇప్పుడు దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా ఆగ్రహం వ్యక్తమవుతుంది.  మనిషికి కొన్ని విలువలు అనేవి ఉండాలి అని మృగం మాదిరి ప్రవర్తించడం ఎంత మాత్రం భావ్యం కాదని పలువురు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్ అయింది. 

 

దీనిపై కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. కేరళలో ఏనుగు హత్య గురించి కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది అని ఆయన పేర్కొన్నారు. దీనిపై తాము దర్యాప్తు చేస్తున్నామని ఎవరిని కూడా వదిలే ప్రశ్నే లేదని ఆయన స్పష్టం చేసారు. ఇది భారతీయ సంస్కృతి కాదని ఆయన పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: