కరోనా సమయంలో ఆర్ధిక ఇబ్బందులు ప్రజలను మరింతగా ఇబ్బంది పెడుతున్నాయి. ఆర్ధికంగా ఒక వెలుగు వెలిగిన వారు అందరూ కూడా ఇప్పుడు నరకం చూస్తున్నారు. తినడానికి తిండి లేక అప్పులు కట్టలేక ఆస్తులు అమ్ముకోలేక కొందరు ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఇదే సమయంలో కుటుంబ కలహాలు కూడా పెరుగుతున్నాయి. 

 

ఈ తరుణంలో విజయవాడ కృష్ణ లంక లో ఒక ఘటన జరిగింది. కృష్ణ లంక లో ఒక మహిళ ఇద్దరు పిల్లలతో సహా బందరు కాలవలో దూకింది. ఈ ఘటనలో మహిళ ప్రాణాలు కోల్పోగా ఇద్దరు పిల్లలను పోలీసులు ప్రాణాలతో కాపాడారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: