హైదరాబాద్ లో డ్రగ్స్ విషయంలో ఇప్పుడు మళ్ళీ సినీ ప్రముఖుల పేర్లు వినపడుతున్నాయి. అమిత్, పరమ్ అనే ఇద్దరు వ్యక్తుల నుంచి 300 మంది సినీ ప్రముఖులు వ్యాపారవేత్తలు డ్రగ్స్ ని కొనుగోలు చేసినట్టు అధికారులు గుర్తించారు. వీరిలో విద్యార్ధులు కూడా ఉన్నారని సమాచారం. ఇప్పుడు డ్రగ్స్ వాడిన వారి లిస్టు ని బయటకు తీస్తున్నారు. 

 

వాట్సాప్ చాటింగ్ తో అసలు విషయం బయటపడినట్టు తెలుస్తుంది. కొంత మంది ప్రముఖులు బెంగళూరు మైక్ అనే వ్యక్తి వద్ద నుంచి డ్రగ్స్ కొన్నారు అని అధికారులు తేల్చారు. సినీ ప్రముఖులు ఎవరు అయినా సరే వదిలిపెట్టేది లేదని అధికారులు చెప్తున్నారు. త్వరలోనే కొందరిని అవసరం అయితే విచారణకు పిలిచే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: