లాక్ డౌన్ సమయంలో ఇప్పుడు ఎక్కువగా నేరాలు జరుగుతున్నాయి. ఇళ్ళల్లో ఖాళీ గా ఉంటున్న జనాలు హత్యలు ఇంట్లోనే వాళ్ళనే చేస్తున్న ఘటనలు క్రమంగా బయటపడుతున్నాయి. భార్యా భర్తల మధ్య లాక్ డౌన్ సమయంలో  జరగడం దీనితో హత్యలు చేసుకోవడం కూడా జరుగుతుంది. 

 

తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం జరిగింది. పశ్చిమగోదావరి జిల్లా టి.నరసాపురం మండలం మక్కినవారి గూడెంలో దారుణం చోటు చేసుకుంది. భర్త అప్పారావుని అతని భార్య లక్ష్మీ అత్యంత దారుణంగా చంపింది. దీనికి కారణం ఏంటీ అనేది తెలియదు గాని కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరి మధ్య కొన్ని రోజులుగా విభేదాలు ఉన్నాయి అని అందుకే ఈ హత్య జరిగి ఉండవచ్చు అని అధికారులు చెప్తున్నారు. హత్యా తర్వాత ఆమె పరారైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: