చెన్నైలో కరోనా కేసులు ఏ మాత్రం కూడా ఆగడం లేదు. రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయి గాని ఎక్కడా కూడా తగ్గే అవకాశం మాత్రం లేదు అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. ఇక ఇది పక్కన పెడితే... ఇప్పుడు చెన్నై ట్రాఫిక్ పోలీసులు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎవరు అయితే  బైక్ మీద డబుల్ రైడింగ్ చేస్తున్నారో వారి మీద కేసులు నమోదు చేయడమే కాకుండా ఫైన్ వెయ్యాలి అని భావిస్తున్నారు. 

 

బైకులు, స్కూటర్లపై ఇద్దరు ప్రయాణిస్తే రూ.500 జరిమానా విధిస్తున్నారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వస్తున్నాయని అధికారులు చెప్పారు. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి కాబట్టి జనాలకు బయటకు రాకుండా కట్టడి చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: