ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల 21 ఢిల్లీ వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. ఆయన రెండు రోజుల క్రితం ఢిల్లీ వెళ్ళాల్సి ఉండగా కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా షెడ్యుల్ మారడంతో పర్యటన వాయిదా పడింది. ఇక అక్కడి నుంచి అయన ఎప్పుడు వెళ్తారు అనే దాని మీద ఆసక్తి నెలకొంది.
ఆయన ఈ నెల 21 న ఢిల్లీ వెళ్ళే సూచనలు ఉన్నాయని సమాచారం. ఆయనతో పాటుగా విజయసాయి రెడ్డి అలాగే ఎంపీలు ఇద్దరు కూడా ఢిల్లీ వెళ్ళే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. దీనిపై రెండు మూడు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఏపే ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.