తెలంగాణ రాష్ట్రాన్ని కరోనా కేసులు కంగారు పెడుతున్నాయి. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 129 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటిలో 127 కరోనా కేసులు రాష్ట్రానికి చెందిన కేసులని ఇద్దరు వలస కార్మికులు మత్రం కరోనా భారీన పడ్డారని తెలుస్తోంది. నిన్న నమోదైన కేసులతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 3020కు చేరుకుంది. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే ఏడుగురు మృతి చెందడంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 99కు చేరింది. 
 
రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 108 కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 6, ఆసిఫాబాద్‌లో 6, మేడ్చల్‌, సిరిసిల్లలో 2 కేసుల చొప్పున యాదాద్రి, కామారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. లాక్‌డౌన్‌ ఆంక్షలను కట్టడి ప్రాంతాలకే పరిమితం చేసి సడలింపులు ఇస్తుండడంతో కరోనా కేసులు పెరుగుతున్నాయి. తెలంగాణలో ఒక్క మేలోనే ఇప్పటిదాకా 1660 మందికి కరోనా నిర్ధారణ అయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: