ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉన్నా సరే ప్రభుత్వం మాత్రం ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తుంది. తాజాగా వరుసగా రెండో ఏడాది కూడా ఆటో డ్రైవర్లకు ఏపీ సర్కార్ 10 వేల నగదు సాయం చేసింది. ఈ సందర్భంగా సిఎం జగన్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. కరోనా ఉన్నా సరే నాలుగు నెలల ముందుగానే తాము ఇస్తున్నామని చెప్పారు ఆయన. 

 

ఆటో ట్యాక్సీ డ్రైవర్ల కష్టాలు  చూసా అని జగన్ వ్యాఖ్యానించారు. పేదవాడు సంతోషంగా ఉంటేనే రాష్ట్రానికి మంచి జరుగుతుందని ఆయన అన్నారు. ఎవరూ కూడా మద్యం సేవించి వాహనాలు నడపవద్దు అని అందరి సంతోషంగా తమకు కావాలి అని జగన్ అన్నారు. ఎవరూ కూడా ఆర్ధికంగా ఇబ్బంది పడవద్దు అని చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: