మరో వైసీపీ ఎమ్మెల్యే అధికారుల తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసారు. వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేసారు. జీజీహెచ్ అభివృద్దిపై సమీక్ష నిర్వహించిన ఆయన... శానిటేషన్ కాంట్రాక్టర్లపై  పలు ఆరోపణలు ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. సెంట్రలైజ్ చేసి డబ్బులు వసూలు చెయ్యాల్సిన అవసరం ఏముంది అంటూ ఆయన అధికారులను ప్రశ్నించారు. 

 

అసలు శానిటేషన్ వర్క్ ని ముంబై వాళ్లకు ఎందుకు ఇచ్చారు అని ఆయన నిలదీశారు. ప్రభుత్వం ఎంతో చిత్త శుద్ధిగా పని చేస్తుంటే కొందరు వ్యవస్థను చెడగొట్టడం దారుణమని అన్నారు. ఆరోగ్య శాఖా మంత్రి ఆళ్ళ నానీ సమక్షంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు. ఇలా చేస్తే గత ప్రభుత్వానికి మనకు ఏంటీ తేడా అని నిలదీశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: