విజయవాడ గ్యాంగ్ వార్ లో మరణించిన తోట సందీప్ భార్య తెజశ్విని సంచలన వ్యాఖ్యలు చేసారు. విజయవాడ లో జరిగింది గ్యాంగ్ వార్  కాదని, ప్లాన్ ప్రకారం అతన్ని హత్యా చేసారని ఆమె ఆవేదన వ్యక్తం చేసారు. చనిపోయే రెండు రోజుల ముందు కూడా బెదిరింపు కాల్స్ సందీప్ కి వచ్చాయని ఆమె చెప్పుకొచ్చారు. 

 

మాట్లాడుకుందాం అని పిలిచి సందీప్ ని పటమట లో చంపేశారు అని ఆమె కన్నీటి పర్యంతం అయ్యారు. ఈ ఘటనలో ఎవరిని కూడా వదిలి పెట్టవద్దు అని ఆమె డిమాండ్ చేసారు. అందరికి శిక్ష పడాలి అంటూ ఆమె వ్యాఖ్యానించారు. కాగా ఈ కేసులో దాదాపు 25 మందిని విజయవాడ పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: