విజయవాడ గ్యాంగ్ వార్ కి సంబంధించి ఇప్పుడు విజయవాడ నగర పోలీసులు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఈ ఘటనలో కీలకంగా భావిస్తున్న నలుగురు వ్యక్తులకు సంబంధించిన సమాచారాన్ని పూర్తి స్థాయిలో సేకరించిన విజయవాడ పోలీసులు దీనిపై రాజకీయ కోణంలో కూడా విచారణ చేస్తున్నారు. రాజకీయంగా ఎవరు అయినా దీని వెనుక ఉన్నారా అనే దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. 

 

రాజకీయ నాయకులు ఉన్నా సరే వదిలి పెట్టవద్దు అని డీజీపీ గౌతం సవాంగ్ ఇప్పటికే అధికారులకు సూచనలు ఇచ్చారు. దీనితో పోలీసులు రంగంలోకి దిగారు. సందీప్ భార్య చెప్పిన విషయాలను కూడా ఇప్పుడు పోలీసులు కూపీ లాగుతున్నారు. ఈ ఘటనలో త్వరలో మరి కొంత మందిని అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: