వ్యవస్థలు, అభివృద్ధి అనేవి ఒకసారి గాడిన పడ్డాక కొత్తగా ఏమీ చేయకపోయినా, అదే ఒరవడిని కొనసాగిస్తే చాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజలు ఫలాలను అందుకుంటూ ముందుకుపోతారన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వ్యవస్థలను చక్కదిద్ది, అభివృద్ధిని పరుగులు పెట్టించడం జరిగిందని... కానీ వైసీపీ వాళ్ళు అధికారంలోకి వచ్చి ఏడాది కాలంలోనే ఆ వ్యవస్థలన్నిటినీ గాడి తప్పించారని ట్వీట్ చేసారు.

 

తమ స్వార్థం కోసం కావాలనే అభివృద్ధిని నాశనం చేసారన్నారు. అమరావతి, పోలవరం పనుల నిలిపివేతే ఇందుకు నిదర్శనమన్నారు చంద్రబాబు.”ఏడాది కాలంలో వచ్చిన పరిశ్రమలు సున్నా, ఉద్యోగాలు సున్నా, రాష్ట్ర ప్రగతి సున్నా, ప్రజల ఆదాయంలో పెరుగుదల సున్నా. నిర్మాణాలు సున్నా. ఉన్న నిర్మాణాలకు పార్టీ రంగులేసి ప్రభుత్వ ఖజానాకు సున్నం వేయడం తప్ప ఈ సున్నా ముఖ్యమంత్రి ఏం చేసినట్టు” అని నిలదీశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: